సిద్దిపేట జిల్లా వేలూరు గ్రామానికి చెందిన బ్యాగరి నర్సింహులు మృతిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్పీ కులానికి చెందిన నర్సింహులు మృతికి కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నవెూదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితులపై దాడులు చేయిస్తూ వారి మరణానికి కారణమవుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. నర్సింహులు మరణానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నర్సింహులు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. దళితులకు మూడు ఎకరాల ఇస్తామని వెూసం చేసి ఇప్పుడు ఉన్న భూమి దౌర్జన్యంగా గుంజుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే ఇంత దారుణమా అంటూ ప్రశ్నించారు ఉత్తమ్.