వడ్లకు నిప్పంటించి.. పురుగుల మందు తాగిన రైతు

వడ్లకు నిప్పంటించి.. పురుగుల మందు తాగిన రైతు
  • వడ్లు కొంటలేరని రైతు ఆత్మహత్యాయత్నం
  • ములుగు జిల్లా బోరు నర్సాపురంలో ఘటన

ఏటూరునాగారం, వెలుగు: కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వడ్లను నెలరోజులైనా కాంటా వేస్తలేరని యువ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరు నర్సాపురం గ్రామానికి చెందిన రామటెంకి సందీప్ మూడున్నర ఎకరాల్లో పండిన వడ్లు నెలకింద గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తరలించి ఆరబోశాడు. తేమ పేరుతో అధికారులు కాంటా వేయలేదు. మరోవైపు పంట సాగు కోసం తెచ్చిన అప్పులకు వడ్డీ భారం పెరగడం, అప్పు ఇచ్చినోళ్లు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో మనోవేదనకు గురై శనివారం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న బస్తాలోని వడ్లను రోడ్డుపై పోసి నిప్పంటించాడు. అనంతరం పురుగుల మందు తాగడంతో స్థానికులు సందీప్ ఫ్యామిలీకి సమాచారం అందించి ఏటూరునాగారం హాస్పిటల్​కు తరలించారు.