పాత చట్టాలతోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయి

పాత చట్టాలతోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయి

కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బర్ భారత్ పథకం లో వేల కోట్ల  రూపాయలు ఖర్చు చేసిందన్నారు కేంద్ర మంత్రి  సంజీవ్ కుమార్ బల్యన్ . వ్యవసాయని  లక్ష కోట్ల రూపాయలు ప్రధాని మోడీ కేటాయించారన్నారు. భారత దేశంలో రైతులు అందరూ సంతోషంగా ఉన్నారన్న సజీవ్ కుమార్…తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేంద్ర పథకానికి అండగా లేదన్నారు. కేంద్రం ప్రకృతి విపత్తుల కోసo కేంద్ర పసల్ బీమా పథకం తెచ్చిందని చెప్పారు. పత్తి రైతులకు మేలు చేసే మద్దతు ధర రూ.5,500 గా నిర్ణయించిందన్నారు. రైతులు నూతన చట్టాల ద్వారా అధిక ధరలకు వారి పంటను అమ్ముకోవచ్చన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను తెలంగాణ ప్రభుత్వం దారి మళ్లీoచి వేరే పథకాలకు కేటాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత చట్టాల తో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి తప్ప ఆగలేదన్నారు. పసల్ భీమా పథకాన్ని  తెలంగాణ ప్రభుత్వo అమలు చేయక పోవడం వల్ల రైతులకు నష్టాలు వచ్చాయన్నారు.

ఈ మూడు చట్టాలు కూడా రైతులకు లాభాన్ని తెచ్చేవి తప్ప నష్టాలు ఉండవన్నారు కేంద్ర మంత్రి సంజీవ్ కుమార్ బల్యన్. తెలంగాణ రాష్ట్రంలో మంచి నాయకత్వo అవసరం ఉంది… అది బీజేపీ తోనే సాధ్యమన్నారు. కరోనా సమయంలో ప్రధాని మోడీ 20 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిన విషయం గుర్తు ఉంచుకోవాలని తెలపారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిపించే అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అబివృద్ది చేయడానికి  బీజేపీ అవసరం చాలా ఉందన్నారు కేంద్ర మంత్రి.