పంట చేనులో గంజాయి సాగు చేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. ఇటీవల వారాసిగూడలోని తన ఇంట్లోనే ఓ సాప్ట్ వేర్ ఎంప్లాయి గంజాయి మొక్కలు పెంచుతూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే..
లేటెస్ట్ గా మొక్కజొన్న చేనులో గంజాయి సాగు చేస్తున్న రైతును సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. శంకర్ పల్లి పరిధిలోని రావులపల్లి కలాన్ గ్రామానికి చెందిన సుధీర్ అనే రైతు తన వ్యవసాయ భూమిలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించించింది సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు. వందల సంఖ్యలో గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు రైతు సుధీర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.