కొనుగోళ్లు ప్రారంభించాలని హైవేపై రైతుల ధర్నా

కొనుగోళ్లు ప్రారంభించాలని  హైవేపై రైతుల ధర్నా

సూర్యాపేట జిల్లా వ్యవసాయ మార్కెట్ ముందు హమాలీలు ఆందోళనకి దిగారు. అధికారులు, కమీషన్ ఏజెంట్లు వేదిస్తున్నారని ధర్నా చేశారు. 2018 నుంచి తమ లైసెన్సులు రెన్యువల్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హమాలీల ధర్నాతో మార్కెట్ యార్డులో కొనుగోళ్లు ఆగిపోయాయి. మార్కెట్ యార్డు బయట వందల ధాన్యం ట్రాక్టర్లు నిలిచిపోయాయి. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు హమాలీలు. సూర్యాపేట మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో.. రైతులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై ధర్నా చేశారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని.. వడ్లకు కనీస మద్దతు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

SRH నుండి మరో క్రికెటర్ ఫేమస్.. అతని తండ్రి కూరగాయల వ్యాపారి

ఎఫ్ -3 ట్రైలర్ వచ్చేస్తుంది..!

రషీద్ ధమాకా

భగీరథ నీటిలో రొయ్యపిల్ల