
జోగిపేట, వెలుగు: జీలుగ విత్తనాల కోసం రైతులు జోగిపేట వ్యవసాయశాఖ కార్యాలయం ముందు క్యూ కట్టారు. సోమవారం ఉదయం 5 గంటల నుంచే పాస్బుక్కులు పట్టుకొని లైన్లో నిల్చున్నారు. అధికారులు ఆలస్యంగా రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడెకరాలు గల రైతులకు ఒక జీలుగ బస్తా మాత్రమే ఇచ్చారు. 400 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు మాత్రమే వచ్చాయని వ్యవసాయాధికారి శ్రీహరి తెలిపారు. కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.