కొమురవెల్లిలో సబ్ స్టేషన్ ఎదుట రైతుల ధర్నా

కొమురవెల్లిలో సబ్ స్టేషన్ ఎదుట రైతుల ధర్నా

కొమురవెల్లి, వెలుగు: తపాస్​పల్లి  గ్రామంలో ట్రాన్సుఫార్మర్ అధిక లోడ్ జంపర్ కొట్టివేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు రైతులు మంగళవారం మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. వ్యవసాయ బావులు వద్ద ట్రాన్సుఫార్మపై లోడ్ పెరిగి రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు జంపర్ కట్ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ALSO READ :గచ్చిబౌలిలో దారుణం .. మహిళపై అత్యాచారం.. హత్య

 

ట్రాన్సుఫార్మర్​ జంపర్ కట్ అయినప్పుడల్లా ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. .