పాన్ గల్, వెలుగు: యూరియా కోసం మండల రైతులు తిప్పలు పడుతున్నారు. మండలకేంద్రంలోని పీఏసీఎస్ ఆఫీస్ వద్ద సోమవారం రైతులు చెప్పులు, ఇటుక పెల్లలు, రాళ్లు క్యూలైన్ లో ఉంచి యూరియా కోసం వేచి ఉన్నారు.
పీఏసీఎస్కు 450 యూరియా బస్తాలు రావడంతో, విషయం తెలుసుకున్న రైతులు ఆఫీస్కు చేరుకొని పడిగాపులు కాశారు. యూరియా కోసం రైతులు ఒకరినొకరు తోసుకోవడం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించి, వారి పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేశారు.
