నామినేష‌న్‌ వేసేందుకు వారణాసికి 45 మంది రైతులు

నామినేష‌న్‌ వేసేందుకు వారణాసికి 45 మంది రైతులు

వారణాసిలో ప్రధాని మోడీపై పోటీకి నామినేషన్ వేసేందుకు ఇవాళ( గురువారం) నిజామాబాద్ నుండి వార‌ణాసికి రైతులు బ‌య‌లుదేరారు. ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గాలకు చెందిన మొత్తం 45మంది రైతులు ప్రత్యేక బస్సులో నాగ్‌పూర్‌ వెళ్లారు. అక్కడ నుంచి రైలులోవారణాసికి చేరుకోనున్నారు.

ఈ నెల 27,28 తేదీలలో ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తామని రైతులు తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు మద్దతు ధరలు సాధించుకోవాలనే ఉద్దేశంతోనే తాము ప్రధానిపై పోటీ చేయడానికి సిద్దమైనట్లు చెప్పారు. తాము స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. తమకు సంఘీభావంగా తమిళనాడుకు చెందిన మరో 100మంది రైతులు వారణాసిలో నామినేషన్లు వేస్తారన్నారు. వారణాసిలో ఉన్న రైతులు, రైతు సంఘాల నాయకులు తమను బలపరుస్తారని తెలిపారు.