హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీజేపీతో సీఎం కేసీఆర్ దొస్తానా.. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్న విధంగా ఉంటుందని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. రెండు పార్టీలతో కలిసి ఆయన నటిస్తున్నారని, అవసరానికి రంగులు మార్చే ఊసరవెళ్లి అని, పూటకో మాట మాట్లాడుతుంటారని బుధవారం ట్విట్టర్లో ఆమె ఫైర్ అయ్యారు.
రైతు రుణమాఫీ చేయక, పంట నష్ట పరిహారం చెల్లించకుండా రైతుల పక్షం ఎలా అవుతారని ప్రశ్నించారు. మూడెకరాలు ఇస్తామని చెప్పి మోసం చేస్తే, దళితుల పక్షం ఎలా అవుతారని నిలదీశారు. రిజర్వేషన్లు పెంచుతామని మైనారిటీలను, పోడు పట్టాలు ఇస్తామని గిరిజనులను ఇలా అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.