హైదరాబాద్, వెలుగు: వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించినట్టుగానే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో మరోసారి నిధులు జమ చేయడం ద్వారా, తాము ముమ్మాటికీ రైతు ప్రభుత్వమేనని చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని తెలిపారు.
ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయం బలపడితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందనే విశ్వాసంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
