హైదరాబాద్ సిటీ/మెహిదీపట్నం, వెలుగు : సర్ ప్రక్రియలో భాగంగా మంగళవారం కార్వాన్ సెగ్మెంట్, గోల్కొండ పరిధిలోని 277వ పోలింగ్ బూత్లో బీఎల్ఓల ద్వారా జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల పరిశీలించారు. ఈ ప్రక్రియను ఏఈఆర్ఓలు పర్యవేక్షించాలన్నారు. కార్వాన్ నియోజకవర్గంలోని 41 పోలింగ్ కేంద్రాల పరిధిలో దాదాపు 40 శాతం ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి విజయవంతంగా అందజేశారన్నారు.
తహసీల్దార్ ఎ. ప్రవీణ్, నోడల్ ఆఫీసర్నవీన్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్కుమార్ పాల్గొన్నారు. అనంతరం షేక్ పేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్(బాయ్స్జేసీ స్కూల్) ను కలెక్టర్విజిట్చేశారు. కాలేజీ డైనింగ్ హాల్లో స్టూడెంట్స్తో కలసి సహపంక్తి భోజనం చేశారు. ప్రిన్సిపాల్ బాలస్వామి పాల్గొన్నారు.
