రంగారెడ్డి జిల్లాలో ఫాంహౌజ్ రేవ్ పార్టీలు.. మంచాల పోలీసుల రైడ్..33 మంది అరెస్ట్

రంగారెడ్డి జిల్లాలో ఫాంహౌజ్ రేవ్ పార్టీలు.. మంచాల పోలీసుల రైడ్..33 మంది అరెస్ట్
  • ఫాంహౌస్ రేవ్ పార్టీ పై.. మంచాల పోలీసుల రైడ్

రంగారెడ్డి జిల్లాలో ఫాంహౌజ్​ రేవ్​ పార్టీలు కలకలం రేపుతున్నాయి. అనుమతి లేకుండా మద్యం, మహిళలతో పార్టీలు.. పక్కా సమాచారంతో పోలీసుల రైడ్ ..పోలీసుల దాడుల్లో భారీగా నగదు, మద్యం, 25 మంది పురుషులు, 8 మంది మహిళలను పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే..

రంగారెడ్డి జిల్లాలో మంచాల మండలం లింగంపల్లి ఫాంహౌజ్​ లో అనుమతి లేకుండా రేవ్​ పార్టీ జరుగుతుండగా పక్కా సమాచారంతో గురువారం ( అక్టోబర్​16) పోలీసులు రైడ్​ చేశారు. ఈ దాడుల్లో 25 మంది పురుషులు,  8 మంది మహిళలను అరెస్ట్ చేశారు. వారినుంచి రూ. 2లక్షల 40 వేల  నగదు,  11 కార్లు, 15 మొబైల్స్​ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.  

►ALSO READ | బీసీ రిజర్వేషన్ బిల్లు పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు