తమిళనాడులో లోయలో పడ్డ బస్సు

తమిళనాడులో లోయలో పడ్డ బస్సు

చెన్నై :  తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.. టూరిస్టులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు చనిపోయారని అధికారులు తెలిపారు. పలువురు ఇతర ప్రయాణికులకు గాయాలయ్యాయని వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలిసి పోలీసులతో పాటు అంబులెన్స్ లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని స్థానికులు తెలిపారు.

కోయంబత్తూరు జోన్ డీఐజీ శరవణ సుందర్ ఈ ప్రమాదం వివరాలను మీడియాకు వివరించారు. ఊటీ నుంచి మెట్టుపాల్యం వెళుతుండగా బస్సు ప్రమాదానికి గురైందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 55  మంది ప్రయాణికులు ఉన్నారని వివరించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. బస్సు ప్రమాదానికి కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. కాగా, బస్సు ప్రమాద బాధితులను ఘటనా స్థలానికి దగ్గర్లోని కూనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాధితులను పరీక్షించిన ఆసుపత్రి జాయింట్​ డైరెక్టర్ పలని సామి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు చనిపోయారని అధికారికంగా తెలిపారు. మరో 25 మంది గాయపడ్డారని, వారికి చికిత్స అందిస్తున్నామని వివరించారు.