జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. డీసీఎం డ్రైవర్, క్లీనర్ సహా కారులోని చిన్నారి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డీసీఎం పంక్చర్ కావడంతో టైర్ మారుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.