
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్యూటీ కోసం వెళ్తున్న పంచాయతీ కార్యదర్శి స్కూటీని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. అతివేగంతో వచ్చిన లారీ అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీ.ఎం.బంజర్ లో జాతీయ రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢీకొట్టడంతో స్కూటీ పై ప్రయాణిస్తున్న పంచాయితీ కార్యదర్శి బాణోత్ సోనాలి(33) అక్కడికక్కేడే మృతి చెందింది. మృతురాలి పై నుండి లారీ వెళ్ళటంతో శరీర భాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి.
మృతురాలు సోనాలి పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామంలో పంచాయితీ కార్యదర్శిగా పని చేస్తుంది. కల్లూరు మండలం నుంచి విధులకు హాజరయ్యేందుకు స్కూటీ పై పెనుబల్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంచి ఉద్యోగం, భవిష్యత్తు ఉన్న సోనాలి మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు.