ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి  మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగు రోడ్డు పై ప్రయాణిస్తున్న ఓ కారు కొల్లూరు వద్దకు రాగానే లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం ఒకరు మృతి చెందారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేవసుకున్నారు. మృతుడు బహదూర్ పూర్ కు చెందిన పరితోష్ గా గుర్తించారు.

పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్ తెల్లవారుజామున జరుగుండవచ్చని అంచనా వేశారు. వేగంగా వచ్చి లారీని ఢీ కొట్టడంతో కారులో ఉన్న పరితోష్ మృతి చెందినట్టు ప్రథమికంగా నిర్ధారించారు.