కుమార్తె పుట్టిన ఆనందం.. ప్రభుత్వ హాస్పిటల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు

కుమార్తె పుట్టిన ఆనందం.. ప్రభుత్వ హాస్పిటల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రానికి చెందిన కాస్తిపురం వినోద్ స్వామి దాతృత్వం చాటుకున్నారు. తనకు కుమార్తె పుట్టిన సంతోషాన్ని కేవలం కుటుంబానికే పరిమితం చేయకుండా.. వందలాది మంది పేద రోగులు, వారి సహాయకులు వచ్చే స్థానిక ప్రభుత్వ దవాఖానలో తాగునీరు దొరకక ఇబ్బంది పడుతున్నారని గుర్తించి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీనిని మంగళవారం ప్రారంభించారు.  – వెలుగు, వికారాబాద్