కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది

కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది

నాగార్జున సాగర్ ఉపఎన్నిక షెడ్యూల్ రాకముందే సీఎం కేసీఆర్ ఎన్నికల సభ నిర్వహించారని తెలిపారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ. దుబ్బాకలో బీజేపీ గెలుపుతో కేసీఆర్ లో భయం మొదలైందన్నారు. ఓటమి భయంతోనే TRS-MIM పొత్తు లేదంటూ డ్రామాలాడారన్నారు. దుబ్బాక ఫలితంతోనే ముందస్తుగా GHMC ఎన్నికలకు వెళ్లారు, ముందస్తుకు వెళ్లినా హైదరాబాద్ ప్రజలు తగిన శాస్తి చేశారన్నారు. హాలియాలో హామీల వర్షం చూస్తుంటేనే కేసీఆర్ లో ఓటమి భయం ఎంత ఉందో తెలుస్తోందన్నారు.

ఎన్నికల వేళ హామీల వర్షం, ఎన్నికలు ముగిసాక మర్చిపోవడం కేసీఆర్ కు అలవాటేనన్నారు డీకే అరుణ. కూర్చేసుకొని కూర్చుంటా… కృష్ణా, గోదావరి నీళ్లతో కాళ్ళు కడుగుతా వంటి పదాలు కేసీఆర్ కు ఊత పదాలుగా మారాయన్నారు. హుజుర్ నగర్ ఉపఎన్నిక లో ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నించారు. వాటిని ఎప్పుడు నెరవేర్చుతారో చెప్పాలన్నారు.

కుల సంఘాలకు సీఎం కేసీఆర్ జీవోలు మాత్రమే ఇచ్చారని… పైసలు మాత్రం ఇవ్వలేదన్నారు డీకే. ఎమ్మెల్సీ ఎన్నికలున్నందునే పీఆర్సీ అంశాన్ని ఎత్తుకున్నాడన్నారు. ఇచ్చిందిలేదు, డ్రామాలు, కాలయపనలే ఉన్నాయన్నారు. ఉద్యోగులు కీలుబొమ్మలు కావొద్దని… కేసీఆర్ కుట్రలను పసిగట్టాలని సూచించారు. నాగార్జున సాగర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో TRSను ఓడించి బంగాళాఖాతంలో కలపాలని కోరారు. కడుపు కొడుతున్న కేసీఆర్ ను ఓటుతో కొట్టండి అని తెలిపారు.

తెలంగాణ వచ్చాక బాగుపడింది కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమేనన్నారు డీకే. అరుణ. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తుంటే కూడా TRS నాయకులు బానిసలుగా ఉండటం దారుణమన్నారు. ఇప్పటికైనా బయటకు రావాలన్నారు. ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకు వస్తారా అన్న డీకే…ఏడేళ్లనుంచి అధికారంలో ఉన్నది మీరే కదా.. అప్పటినుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. టీఆరెస్ వీరుల పార్టీకాదు, తెలంగాణ ద్రోహుల పార్టీ అన్నారు. కేసీఆర్ భాష…వీధి గుండాల ఉందన్నారు. సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన మహిళలను కుక్కలంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే గౌరవంలేని సీఎం ఉన్నాడు కాబట్టే ..రాష్ట్రంలో ఈస్థాయిలో అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ రాజకీయాలను కాపడేందుకే పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నట్లుందన్నారు.

మజ్లీస్ తో పొత్తు లేదన్నTRS.. వారి మద్దతులేకపోతే మేయర్ కాలేని స్థితిలో టీఆర్ఎస్ ఉందన్నారు. TRS కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లపై నమ్మకం లేకనే KCR మజ్లీస్ ను నమ్ముకున్నారని తెలిపారు. మేయర్ ఎన్నికలో MIMమద్దతు తీసుకోవడంపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు డీకే అరుణ.