
నిర్భయ రేప్, హత్య కేసు దోషులను ఫిబ్రవరి 1న ఉరి తీసేందుకు తీహార్ జైలు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మూడు సార్లు డమ్మీ ట్రయల్స్ పూర్తి చేశారు అధికారులు. ఉరి శిక్ష అమలుకు రోజులు దగ్గర పడుతుండడంతో జైలు అధికారులు నలుగురు దోషుల చివరి కోరిక తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనిపై వారిని ప్రశ్నించగా ఏ మాత్రం నోరు మెదపడం లేదని తెలుస్తోంది. అలాగే వారి తర్వాత కుటుంబానికి సంబంధించిన ఆస్తులను ఎవరికి చెందాలని కోరుకుంటున్నారో చెప్పాలని అడిగినా కూడా వారి నుంచి ఏ స్పందన లేదని జైలు అధికార వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ ప్రశ్నలు వేటీకి వారి నుంచి సమాధానం రాకపోవడం, ఉరికి టైం దగ్గర పడుతుండంతో వారి కుటుంబ సభ్యులు వారానికి రెండ్రోజులు కలిసేందుకు జైలు అధికారులు అవకాశం కల్పించారు. కుటుంబసభ్యులతో స్వేచ్ఛగా మాట్లాడుకునే వీలు ఇస్తున్నారు.
చావు భయం
2012 డిసెంబరు 16న కదిలే బస్సులో నిర్భయను అత్యంత పాశవికంగా హింసించి అత్యాచారం చేసిన దుర్మార్గుల్లో ఇప్పుడు చావు భయం కనిపిస్తోంది. నలుగురు దోషులు ముకేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ సింగ్, వినయ్ శర్మ వారివారి బ్యారక్లలో టెన్షన్ టెన్షన్గా గడుపుతున్నారని జైలు సిబ్బంది చెబుతున్నారు. ఆహారం కూడా గతంలో మాదిరిగా కాకుండా కొంచెం కొంచెంగా తింటున్నారని తెలిసింది. ఉరి తీసే నాటికి వారు పూర్తి ఆరోగ్యంగా ఉండాలన్న నిబంధన ఉండడంతో జైలు అధికారులు ప్రతి రోజూ వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. ప్రస్తుతం నలుగురూ శారీరకంగా, మానసికంగా ఫిట్గా ఉన్నారని సమాచారం.
More News:
నిర్భయ దోషుల్ని ఉరి తీయడానికి నేను రెడీ: పవన్
చిన్నతనంలో నాపై రేప్ జరిగింది: అర్జున్ రెడ్డి మూవీ స్టార్
కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్!
ఎలాగో చస్తాం.. మళ్లీ ఉరి శిక్షెందుకు: సుప్రీంలో నిర్భయ దోషి వింత పిటిషన్