
న్యూఢిల్లీ: కరోనా సోకి ఓ టీచర్ మరణించిన ఘటన ఆదివారం ఢిల్లీలో జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన ఆమెను అధికారులు ఇటీవల డిప్యుటేషన్పై పేదలకు సరుకులు పంపిణీ చేసే పనిలో నియమించారు. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఆమె రేషన్ డిస్ట్రిబ్యూషన్ విధుల్లో పాల్గొన్నది. అయితే కరోనా బారినపడి హాస్పిటల్ పాలైన ఆమె పరిస్థితి విషమించడంతో ఆదివారం మరణించారు. ఈ విషయాన్ని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఢిల్లీలో ఇప్పటివరకు 6, 923 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారని.. వారిలో 73 మంది మరణించారని తెలిపారు అధికారులు.