గచ్చిబౌలి, వెలుగు: జెరేనియం ఆకుల వ్యర్థాలతో ‘బయోచార్’గా (ఎరువు) మార్చే సరికొత్త హరిత సాంకేతికతను హైదరాబాద్ సెంట్రల్యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. ఇది సేంద్రియ వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.
‘అప్సైక్లింగ్ ఆఫ్ వేస్ట్ జెరేనియం లీవ్స్ ఇన్టూ బయోచార్ ఫర్ సాయిల్ అమెండ్మెంట్’ పేరుతో సాగిన పరిశోధనకు హెచ్సీయూ లైఫ్ సైన్సెస్ప్రొఫెసర్ అప్పారావు పొడిలే, ఇంజినీరింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి చెందిన ప్రొ. డా.-ఇంగ్. వి.వి.ఎస్.ఎస్. శ్రీకాంత్ నాయకత్వం వహించారు.
జెరేనియం నూనె తయారీలో ఏటా వేల టన్నుల ఆకులు వ్యర్థమవుతున్నాయని, ఈ వ్యర్థాన్ని నియంత్రిత పైరాలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్గా మార్చి నేలలో కలపితే భూమి సారవంతమవుతుందన్నారు. నేలలో కార్బన్ నిల్వ పెరుగడంతోపాటు నీటిని పట్టి ఉంచే సామర్థ్యం, పోషకాల లభ్యత మెరుగవుతుందన్నారు. తద్వారా రసాయన ఎరువుల వినియోగం తగ్గి, వ్యవసాయోత్పత్తి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
