విజిలెన్స్ రిపోర్ట్ లపై చర్యలు తీసుకోండి : పద్మనాభరెడ్డి

విజిలెన్స్ రిపోర్ట్ లపై చర్యలు తీసుకోండి : పద్మనాభరెడ్డి
  •     సీఎంకు ఎఫ్‌‌‌‌జీజీ లేఖ

హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగుల అవినీతిపై విజిలెన్స్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఇచ్చిన రిపోర్ట్​లపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్​జీజీ) సెక్రటరీ పద్మనాభరెడ్డి లేఖ రాశారు. గత పదేండ్లలో విజిలెన్స్ శాఖ ప్రభుత్వానికి ఎన్నో రిపోర్ట్‌‌‌‌లు ఇచ్చినా అక్కడి అధికారులు వాటిని సీఎంవోకు పంపకుండా తొక్కి పెట్టారని ఆరోపించారు.

దశాబ్దకాలంలో విజిలెన్స్ ఆఫీసర్లు అధికారుల అవినీతిపై 3,336 రిపోర్ట్​లు పంపారన్నారు. ఈ రిపోర్ట్​లపై గతంలో గవర్నర్, సీఎస్​కు ఫిర్యాదు చేశామని అయినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో అవినీతి ఎక్కువగా ఉందని.. ఇలాంటి వాటిపై నిఘా పెట్టాలని ఆయన కోరారు.