ఉప్పల్ స్టేడియంలో ఉద్రిక్తత.. సన్రైజర్స్, ముంబై ఫ్యాన్స్ మధ్య గొడవ

ఉప్పల్ స్టేడియంలో ఉద్రిక్తత.. సన్రైజర్స్, ముంబై ఫ్యాన్స్ మధ్య గొడవ

ఐపీఎల్ అంటేనే ఫ్యాన్స్ ఓ ఫీల్ లోకి వెళ్లిపోతారు. నేషనల్ టీంతో కలిసున్న క్రికెట్ ప్రేమికులు.. ఐపీఎల్ మొదలవగానే ఫేవరెట్ టీం అంటూ విడిపోతారు. గ్రూప్స్ గా విడిపోయి నా టీం గొప్ప అంటే నా టీం గొప్ప అని ట్రోల్స్ చేసుకుంటారు. అయితే, ఇప్పటివరకు ఇదంతా సోషల్ మీడియా వరకే జరిగేది. అయితే, మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ముంబై, సన్ రైజర్స్ మ్యాచ్ లో ఫ్యాన్స్ కొంచెం శృతి మించారు.

ఇరు జట్ల ఫ్యాన్స్ గొడవకు దిగారు. తమ ఫేవరెట్ టీం గెలుస్తుంది అని పందెం కాస్తూ రెండు గ్యాంగులుగా విడిపోయి కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు గ్యాంగులను విడదీసి గొడవ సర్దుమనిగేలా చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గొడవకు కారణం అయిన వాళ్లను స్టేడియం నుంచి బయటికి పంపించి వాళ్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.