
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం కార్పొరేషన్లో డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ఫైనల్ డ్రాఫ్ట్ ఈ నెల 21న ప్రకటించాల్సి ఉన్నా ఇంకా ప్రకటించలేదు. డివిజన్ల ఏర్పాటు ప్రాథమిక డ్రాఫ్ట్ ను ఈ నెల 4న కొత్తగూడెం కార్పొరేషన్ ఆఫీస్లోని నోటీస్ బోర్డులో పెట్టారు. 5 నుంచి 12వరకు ప్రజల వద్ద నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. 51 అభ్యంతరాలు వచ్చాయి.
ఇందులో 23 రిజెక్ట్ చేశారు. మిగతా 28 అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని డివిజన్లలో పలు మార్పులు చేశారు. అనంతరం ఈ నెల 20న కలెక్టర్ ఆమోదంతో సీడీఎంఏకు డివిజన్ల ముసాయిదాను కార్పొరేషన్ అధికారులు పంపించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 21న ఫైనల్ డ్రాఫ్ట్ ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ప్రకటించలేదు. దీంతో ప్రజల్లో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.