ముంబై x విదర్భ..ఇవాళ నుంచి రంజీ ఫైనల్

ముంబై x  విదర్భ..ఇవాళ నుంచి రంజీ ఫైనల్

ముంబై :  డొమెస్టిక్ క్రికెట్‌‌లో టాప్‌ టీమ్ ముంబై రంజీ ట్రోఫీలో 42వ టైటిల్‌‌పై కన్నేసింది. రహానె కెప్టెన్సీలోని ముంబై వాంఖడే స్టేడియంలో ఆదివారం మొదలయ్యే ఫైనల్లో విదర్భతో తలపడనుంది. గ్రూప్ దశలో సత్తా చాటిన ఇరు జట్లూ నాకౌట్‌‌లోనూ మెరుగైన పెర్ఫామెన్స్‌‌ చేసి ఫైనల్‌‌కు వచ్చాయి. ముంబై టీమ్‌‌ బ్యాటింగ్‌‌లో చాలా బలంగా ఉంది. 10, 11వ నంబర్ ఆటగాళ్లు సైతం సెంచరీలు కొట్టారు. మరోవైపు విదర్భ ఆల్‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌తో రాణిస్తోంది. దాంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు నడిచే అవకాశం ఉంది.