బీజేపీ తెలంగాణకు ఒక్క మెడికల్​ కాలేజీ ఇవ్వలే..

బీజేపీ తెలంగాణకు ఒక్క మెడికల్​ కాలేజీ ఇవ్వలే..

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మెడికల్​ కాలేజీ ఇవ్వలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేటలో సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర​ ప్రభుత్వం కట్టిన వైద్య కళాశాలలను బీజేపీ కట్టిందని చెబుతూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్​లు ప్రచారం చేస్తున్నారని ఇలాంటి వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.

ఇటీవల దేశంలో 157 మెడికల్​ కాలేజీలు పెడుతున్నట్లు కేంద్రం ప్రకటించగా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదన్నారు. తాము కడుతున్న వాటిని లెక్కలో చూపిస్తూ..  బీజేపీ రాష్ర్టాధ్యక్షుడు బండి సంజయ్​ మెడికల్​ కాలేజీలు తెచ్చామని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఎయిమ్స్​కే తట్టెడు మట్టి ఎత్తలేని వారు మెడికల్​ కాలేజీలు తెచ్చామనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నేషనల్​ మెడికల్​ కౌన్సిల్ రాష్ట్రానికి 9 మెడికల్​ కాలేజీలకు అనుమతి ఇచ్చిందన్నారు.   కేంద్రం విభజన చట్టంలో హామీలు నెరవేర్చాలని డిమాండ్​ చేశారు.