అనాథ యువతి పెళ్లికి ఆర్థిక సాయం

అనాథ యువతి పెళ్లికి ఆర్థిక సాయం

రాయికల్​, వెలుగు: రాయికల్ పట్టణానికి చెందిన అనాథ యువతి సంధ్య వివాహా  ఖర్చులకు విశ్వశాంతి హైస్కూల్  నిర్వాహకుడు మచ్చ గంగాధర్ శుక్రవారం  రూ.10వేల ఆర్థిక సహాయం చేశారు.  తల్లిదండ్రుల మృతితో  అనాథగా మారిన యువతిని ఎలాంటి లాంఛనాలు లేకుండా పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు ముందుకు వచ్చాడు. పెళ్లి ఖర్చులకు దాతల నుండి ఆర్థిక సాయం కోరగా పలువురు  స్పందించి సాయం చేస్తున్నారు. కార్యక్రమంలో సామాజిక సేవకుడు కడకుంట్ల జగదీశ్వర్, స్కూల్​సిబ్బంది పాల్గొన్నారు.