దర్భంగా బ్లాస్ట్‌కు పాక్ నుంచి ఆర్థికసాయం

దర్భంగా బ్లాస్ట్‌కు పాక్ నుంచి ఆర్థికసాయం

దర్భంగా బ్లాస్ట్ కేసుకు సంబంధించిన దర్యాప్తును ఎన్ఐఏ మరింత ముమ్మరం చేసింది. మాలిక్ బ్రదర్స్‌ను అధికారులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్‌ను మాదాపుర్ ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి నిందితులను వారి ఇంటికి తీసుకెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. పార్సిల్ బుకింగ్ ఎలా జరిగింది, ఐఈడీ తయారీకి కావాల్సిన కెమికల్స్ ఎక్కడ కొన్నారు, దాడికి ఎవరు సాయం చేశారనే దానిపై అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే నిందితులకు పాకిస్థాన్ నుంచి లక్షా 60 వేల ఆర్థిక సాయం అందినట్లు అధికారులు గుర్తించారు.