
7 నుంచి ఎల్బీనగర్– మియాపూర్ రూట్లో స్టార్ట్
గాంధీ, ముషీరాబాద్, భరత్నగర్, మూసాపేట్, యూసుఫ్గూడ స్టేషన్లు క్లోజ్
సికింద్రాబాద్, వెలుగు: కరోనా లాక్డౌన్తో ఇన్నాళ్లు ఆగిపోయిన మెట్రో రైళ్లు.. ఈ నెల 7 నుంచి మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. మూడు విడతల్లో రైళ్లను ప్రారంభించనున్నారు. తొలి విడతలో భాగంగా ఎల్బీనగర్– మియాపూర్ లైన్లో మెట్రో రైళ్లు నడవనున్నాయి. రెండో విడతలో 8 నుంచి నాగోల్– రాయదుర్గం, మూడో విడతలో 9 నుంచి ఎంజీబీఎస్– జేబీఎస్ రూట్లలో సర్వీసులు నడుపనున్నట్టు మెట్రో అధికారులు ప్రకటించారు. ఏడు, ఎనిమిదో తేదీల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వీసులు నడుస్తాయన్నారు. 9వ తేదీ నుంచి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు నడుస్తాయన్నారు. ఐదు స్టేషన్లను మూసివేస్తున్నట్టు చెప్పారు. గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, భరత్నగర్, మూసాపేట, యూసుఫ్గూడ స్టేషన్లు మూసే ఉంటాయన్నారు. స్మార్ట్ కార్డ్ ద్వారానే ప్రయాణాలు చేయాలని ప్యాసింజర్లకు సూచించారు. స్టేషన్లలో టికెట్ల జారీని నిలిపేస్తున్నట్టు చెప్పారు. ఆన్లైన్లోనే స్మార్ట్ కార్డ్ను రీచార్జ్ చేసుకోవాలన్నారు. ప్యాసింజర్లు మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని, లేకుంటే ఫైన్ వేస్తామన్నారు. మాస్కులు పెట్టుకున్నది లేనిదీ.. సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నది లేనిదీ.. సీసీ కెమెరాల ద్వారా చూస్తూ ఉంటామన్నారు. లక్షణాలున్న వ్యక్తులు దగ్గర్లోని టెస్టింగ్ సెంటర్లలో టెస్టులు చేసుకుని, అటెస్టేషన్ తీసుకురావాలన్న రూల్ పెట్టారు.