బాసర ట్రిపుల్ ఐటీలో అగ్నిప్రమాదం

బాసర ట్రిపుల్ ఐటీలో అగ్నిప్రమాదం

బాసర ట్రిపుల్ ఐటీలో భారీ అగ్నిప్రమాదం
ఫర్నీచర్ దగ్ధం, మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది

నిర్మల్  జిల్లా : బాసర  ట్రిపుల్  ఐటీ ఏబీ-1 బ్లాక్ లో అగ్ని ప్రమాదం జరిగింది.  విషయం తెలుసుకున్న భైంసా అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి వెళ్లి మంటలు ఆర్పివేశారు. అగ్నిప్రమాదంతో  ఏబీ-1 బ్లాక్ లోని ఫర్నీచర్, ప్రొజెక్టర్, కుర్చీలు, టేబుల్స్ కాలిపోయాయి. క్యాంపస్ మొత్తం పోగతో కమ్మేసింది. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రెండు నెలల నుంచి స్విచ్ లు ఆఫ్ చేయకపోవడంతో విద్యుత్ సరఫరా జరిగి, రెండు సార్లు ప్రమాదాలు జరిగినా, అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..