టపాకుల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: ఐదుగురు మృతి

టపాకుల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: ఐదుగురు మృతి

వెస్ట్ బెంగాల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. వెస్ట్ బెంగాల్ నార్త్ 24 పరగనాస్  జిల్లాలోని ఓ టాపాకుల ఫ్యాక్టరీలో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది.  సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అనుకోకుండా ఒక్కసారిగా టపాకులు పేలడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారని… మరింత సమాచారం తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.