టెహ్రాన్: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో తమను లక్ష్యంగా చేసుకోకుండా ఇరాన్ను బుజ్జగించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలో 3 బిలియన్ డాలర్ల క్యాష్, 2 టన్నుల బంగారం, 15 విమానాలు ఇరాన్కు బదిలీ చేసినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
యూఏఈ బ్యాంకుల్లో ఫ్రీజ్అయిన బిలియన్ల డాలర్ల విలువైన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడంతో పాటు, బంగారం, ప్యాసింజర్ విమానాలను ఇరాన్కు తరలించినట్టు టెహ్రాన్లోని పలు వర్గాలు తెలిపాయి. అలాగే, సుమారు 283 మిలియన్ డాలర్లు విలువ చేసే 2 టన్నుల బంగారాన్ని ఇరాన్కు చేరవేశారు. ఈ ట్రాన్స్పోర్ట్ అంతా ఈ నెల 11, 12 తేదీల్లో యూఏఈకి చెందిన రాయల్ జెట్ విమానం ద్వారా జరిగింది.
ఈ విమానం అబుదాబి నుంచి టెహ్రాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయం, కరాజ్ లోని పయామ్ విమానాశ్రయానికి వెళ్లి ఈ ఆస్తులను అప్పగించినట్టు తెలిసింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ తన వాణిజ్య విమాన సర్వీసులను కోల్పోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని యూఏఈ కంపెనీల ద్వారా 15 సెకండ్ -హ్యాండ్ ప్యాసింజర్ విమానాల విక్రయానికి యూఏఈ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఈసీటీ ఏవియేషన్ సపోర్ట్ ద్వారా మాజీ సౌదియా బోయింగ్ 777 విమానాలు ఇరాన్కు చేరాయి.
