హైదరాబాద్ బస్ భవన్ లో అగ్ని ప్రమాదం..సెల్లార్ లో ఎగిసిపడిన మంటలు

హైదరాబాద్ బస్ భవన్ లో అగ్ని ప్రమాదం..సెల్లార్  లో ఎగిసిపడిన మంటలు

హైదరాబాద్​: ఆర్టీసీ క్రాస్​ రోడ్డులోని బస్​ భవన్​ లో అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం ( జనవరి 31) సాయంత్రం బస్​ భవన్​ బి1 సెల్లార్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భవనం అంతటా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో భవన్​ లోని ఆర్టీసీ ఉద్యోగులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్​ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. 

ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్ భవన్ లోని B1 సెల్లార్​ లోని పవర్​ బ్యాకప్​ యూపీఎస్​ బ్యాటరీలలో షార్ట్​ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు పక్కనే ఉన్న పాత ఫైల్స్​ కు మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎస్​ ఆర్​ పీఎస్​ కు సంబందించిన కొన్ని ఫైల్స్ కాలిపోయినట్లు అధికారులు చెప్పారు. 

 ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని తెలిపారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. 

►ALSO READ | షాకింగ్ ఘటన..వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..మహిళపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మరో మహిళ