రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ అప్పా జంక్షన్ దగ్గర కారులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ కు వెళ్తుండగా రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి.
కారు ముందు భాగం నుండి పొగలను గమనించిన కారు డ్రైవర్ వెంటనే కారు దిగాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధం అయ్యింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.