
జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రాజీవ్గృహకల్పలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. రాజీవ్గృహకల్ప బ్లాక్నంబర్ 13, ఫ్లాట్నంబర్ 24లో వెంకటన్న–అమీనా దంపతులు నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం 5.20 గంటల సమయంలో తాళం వేసి, ఊరెళ్లడానికి బస్టాండ్కు వెళ్లారు.
కాసేపటికే ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. గమనించిన చుట్టుపక్కల వారు వెంకటన్నకు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో తిరిగి వచ్చారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్ , దుస్తులు, ఇతర వస్తువులన్నీ కాలిపోయాయని బాధితుడు తెలిపారు. షార్ట్ సర్క్యూట్వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.