శంషాబాద్, వెలుగు: మైలార్దేవ్ పల్లి డివిజన్ టాటానగర్ కాలనీలోని రాఘవేంద్ర ప్లాస్టిక్ వేస్ట్ గోదాంలో సోమవారం రాత్రి 11 గంటలకు షార్ట్సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గంటసేపు శ్రమించి మంటలను ఆర్పివేశారు. అక్కడికి దగ్గరలోని బృందావన్కాలనీని దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్పొరేటర్తోకల శ్రీనివాస్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.