ప్లాస్టిక్ స్క్రాప్​ గోదాంలో అగ్నిప్రమాదం

ప్లాస్టిక్ స్క్రాప్​ గోదాంలో అగ్నిప్రమాదం

శంషాబాద్, వెలుగు: మైలార్​దేవ్ పల్లి డివిజన్ టాటానగర్ కాలనీలోని రాఘవేంద్ర ప్లాస్టిక్ వేస్ట్ గోదాంలో సోమవారం రాత్రి 11 గంటలకు షార్ట్​సర్క్యూట్ ​కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గంటసేపు శ్రమించి మంటలను ఆర్పివేశారు. అక్కడికి దగ్గరలోని బృందావన్​కాలనీని దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్పొరేటర్​తోకల శ్రీనివాస్​రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.