భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని జీజీహెచ్లో తొలిసారిగా ఆర్థిస్కోపిక్ కీ హోల్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం. శ్రీహరిరావు, హాస్పిటల్ సూపరింటెండెంట్ రాధామోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలానికి చెందిన ఎన్. ఠాగూర్తో పాటు కొత్తగూడెంకు చెందిన టి. స్రవంతి అనే మహిళకు వేర్వేరు సందర్భాల్లో మోకాలికి దెబ్బ తగిలి ఇబ్బందులు పడ్తున్నారు.
వీరు ట్రీట్మెంట్ కోసం జీజీహెచ్కు వచ్చారు. ఇద్దరిని పరీక్షించిన వైద్యులు ఏసీఎల్ లిగ్మెంట్ పూర్తిగా దెబ్బతిన్నదని నిర్ధారించారు. ఆర్దో పెడిక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ నరసింహారావు ఆధ్వర్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్, అనస్థీషియన్ డాక్టర్ రమేశ్, వైద్య సిబ్బంది అధునాతన ఆర్థో స్కోపిక్ కీ హోల్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.
