యాదాద్రి జిల్లాలో ఫస్ట్ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో..ముగిసిన‘పోస్టల్’ఓటింగ్

యాదాద్రి జిల్లాలో ఫస్ట్ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో..ముగిసిన‘పోస్టల్’ఓటింగ్
  • ఓటు హక్కు వినియోగించుకున్న 400 మంది

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్​జరిగే ఆరు మండలాల్లో పోస్టల్​ బ్యాలెట్​ఓటింగ్​ ప్రక్రియ ఆదివారం ముగిసింది.  400 మంది ఎంప్లాయిస్​ ఓటు  హక్కు వినియోగించుకున్నారు. మూడు విడతలుగా జరిగే ఎన్నికల కోసం 8 వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. ఎంప్లాయ్​ ర్యాండమైజేషన్​ ప్రక్రియ కూడా ముగిసింది. 

విధులు నిర్వర్తించే వారిలో ఇతర జిల్లాలకు చెందిన ఎంప్లాయ్​ ఉన్నందున మూడు విడతల్లో కలిపి దాదాపు 1500 మంది పోస్టల్​ బ్యాలెట్​ ఓటింగ్​లో పాల్గొనాల్సి ఉంది.  మూడు విడతలకు  సంబంధించి పోస్టల్​ బ్యాలెట్​ ఓటింగ్​ను ఈ నెల 7, 10,13న నిర్వహించాల్సి ఉంటుంది. 

దీంట్లో భాగంగానే మొదటి విడతలో జిల్లాలోని ఆలేరు, రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట, ఆత్మకూర్​(ఎం) మండలాల్లోని ఏకగ్రీవమైన 16 పంచాయతీలు పోనూ 137 పంచాయతీల్లో ఈ నెల 11న పోలింగ్ జరుగనుంది. ఈ మండలాల్లోని పంచాయతీల్లో ఆదివారం పోస్టల్​ బ్యాలెట్​ ఓటింగ్​ ముగిసింది. ఈ ఓటింగ్​ ప్రక్రియను కలెక్టర్​  హనుమంతరావు, అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కరరావు వేర్వేరుగా పరిశీలించారు.