దేశంలోనే రాజేంద్రనగర్ ఠాణాకు ఫస్ట్ ప్లేస్

దేశంలోనే రాజేంద్రనగర్ ఠాణాకు ఫస్ట్ ప్లేస్

గండిపేట, వెలుగు : సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని రాజేంద్రనగర్‌ ఠాణా దేశంలోనే ఫస్ట్ ప్లేస్​లో నిలిచింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో ఉత్తమ ప్రతిభ కనబరిచి అరుదైన ఘనతను సాధించింది. ఈనెల5న జైపూర్‌లో జరిగే డీజీపీల కాన్ఫరెన్స్​లో అవార్డును అందుకోవాల్సిందిగా పేర్కొంది. శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల పరిష్కారం, ఠాణాకు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడడం వంటి అంశాల్లో మంచి మార్కులను కొట్టేసింది. 

మహిళా భద్రతలోనూ టాప్‌ ప్లేస్ సాధించింది. మిస్సింగ్‌ కేసులను త్వరితగతిన ట్రేస్‌ , కుటుంబ వివాదాలను కౌన్సెలింగ్‌తో ఠాణా స్థాయిలోనే పరిష్కరించడం వంటి అంశాల్లోనూ మంచి స్కోరును సాధించింది. వీటితో పాటుగా గుర్తు తెలియని వ్యక్తులు మరణించినప్పుడు, డెడ్​బాడీలు దొరికనప్పుడు, వెంటనే గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయడం, పోస్టుమార్టం తర్వాత వెంటనే అప్పగించడంపై రాజేంద్రనగర్‌  పోలీసుల పనితీరును కేంద్రహోం శాఖ ప్రత్యేకంగా అభినందించింది.