
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8వ తేదీ సాయంత్రం నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని మృగశిర ట్రస్ట్ కార్యదర్శి బత్తిని హరనాథ్ గౌడ్ తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమం 8న సాయంత్రం 6 గంటల నుంచి 9న సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. గతేడాది 4లక్షల మందికి ప్రసాదం పంపిణీ చేశామన్నారు.
1845లో తమ ముత్తాత వీరన్న హయాం నుంచి ఈ చేప ప్రసాదం పంపిణీని కొనసాగిస్తున్నట్లు హరనాథ్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం కోసం ఎంతమంది వచ్చినా అందరికీ ఇస్తామని.. ఎవరికీ అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు బత్తిని హరనాథ్ గౌడ్.