ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్ లోని గూండ్ల చెరువులో సోమవారం చేప పిల్లలను వదిలారు.ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి చేప పిల్లలను వదిలిన కొద్ది సేపటికే ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి చేప పిల్లలను వదిలారు. డీసీసీబీ డైరెక్టర్ న్యాలకంటి వాసు, కాంగ్రెస్ నాయకులు వెంకటగిరి, భూపెందర్, రాజు, చిట్టి రెడ్డి, ప్రసాద్,భగత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
చెరువు భూములు కబ్జా కాకుండా చూసుకోవాలి: ఎమ్మెల్యే పైడి రా కేశ్రెడ్డి
చెరువు భూములు కబ్జా కాకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. గంగపుత్రుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై చేప పిల్లలు పంపిణీ చేస్తుందన్నారు. అనంతరం జిరాయత్ నగర్లోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ను పరిశీలించిన ఎమ్మెల్యే అదనపు తరగతి గదులు, టాయిలెట్స్ ను నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట గంగపుత్ర సంఘం జిల్లా ప్రెసిడెంట్ బింగి పెంటయ్య, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ మందుల బాలు, పోల్కం వేణు, కలిగోట గంగాధర్, భరత్, ఉదయ్ గౌడ్, సుంకరి రంనగ్న తదితరులు ఉన్నారు.
