కేసీఆర్, హరీశ్రావులను వందసార్లు ఉరితీయాలి : మెట్టు సాయికుమార్

కేసీఆర్, హరీశ్రావులను వందసార్లు ఉరితీయాలి : మెట్టు సాయికుమార్
  •     ఫిషరీస్ కార్పొరేషన్ ​చైర్మన్ ​మెట్టు సాయికుమార్ 

హైదరాబాద్​, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, హరశ్​రావు, కేటీఆర్​లను ఒక్కసారి కాదు.. వందసార్లు ఉరితీయాలని ఫిషరీస్ కార్పొరేషన్​చైర్మన్ ​మెట్టు సాయికుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వాదాన్ని, ఉద్యమ కారులను అవమానించింది వారేనని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఉసురు, కన్నీటితో భస్మం కాక తప్పదని హెచ్చరించారు. 

బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్​లో చేరిక..

ఖమ్మం కార్పొరేషన్​కు చెందినబీఆర్ఎస్ కార్పొరేటర్లు సోమవారం గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్​లో చేరారు. గోళ్ల చంద్రకళ, డోనవన్ సరస్వతి, దాదే అమృతమ్మ, చిరుమామిళ్ల లక్ష్మి, మోతారపు శ్రావణి కాంగ్రెస్​లో​చేరారు.