చెరువులో చేపలు మాయం: రాత్రికి రాత్రే పట్టేశారు

చెరువులో చేపలు మాయం: రాత్రికి రాత్రే పట్టేశారు

సూర్యాపేట జిల్లాలో మరో చెరువు లూటీ అయింది. మేళ్ళచెరువు మండలం కందిబండలో చేపల లూటీ చేశారు స్థానికులు. దీంతో గ్రామస్థులకు చేపల చెరువు కాంట్రాక్టర్ కు మధ్య గొడవ జరిగింది. చేపలు దోచుకెళ్లడంతో.. ఆగ్రహించిన కాంట్రాక్టర్ అనుచరులు చెరువు దగ్గర ఉన్న 11 బైకులను తగలబెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే బైకులు పూర్తిగా దగ్దమయ్యాయి.

తమ జీవనాధారమైన చేపలు లూటీ చేశారని ఆరోపిస్తున్నారు చేపల చెరువు కాంట్రాక్టర్లు.25 లక్షల విలువ చేసే చేపలు లూటీ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు లూటీపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. గత నెలలో.. మేళ్లచెరువు మండలానికి సంబంధించిన గణపవరం చెరువు లూటీని చేశారు. ఈ ఘటన మరువకముందే మరో చెరువు లూటీ చేశారు గ్రామస్థులు.