విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యం ముఖ్యం: పీవీ సింధు

విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యం ముఖ్యం: పీవీ సింధు

ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కోసం మెరుగైన పద్ధతులు పాటించాలని స్టార్ షట్లర్ పీవీ సింధు సూచించారు. చదువుతో పాటు ఆరోగ్యం సైతం ముఖ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం 2019లోనే  విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఫిట్ ఇండియా కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. కొంపల్లిలోని సుచిత్ర అకాడమీలో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

కరోనా కారణంగా ఈ కార్యక్రమం కొంత వెనకడుగు పడినా మళ్ళీ అందరికీ అవగాహన కల్పించే విధంగా.. కేంద్రం చర్యలు తీసుకుంటుందని పీవీ సింధు తెలిపారు. ఇప్పుడున్న కాలంలో యువత, చదువుతో పాటు క్రీడలు, యోగా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి కొంత సమయం కేటాయించాలని కోరారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆటలు, వ్యాయామం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఆటల్లో రాణిస్తారని అన్నారు.