బీజాపూర్ జిల్లాలో ఎన్​కౌంటర్ .. ఐదుగురు మావోయిస్టులు మృతి

బీజాపూర్  జిల్లాలో ఎన్​కౌంటర్ .. ఐదుగురు మావోయిస్టులు మృతి
  • బీజాపూర్  జిల్లాలో ఎన్​కౌంటర్​ .. ఐదుగురు మావోయిస్టులు మృతి    చనిపోయిన వాళ్లలో 
  • ఇద్దరు మహిళలు.. వారిని గుర్తించాల్సి ఉందన్న ఎస్పీ
  • పది మందిని అదుపులోకి తీసుకున్నారని పౌర హక్కుల సంఘం ఆరోపణ
  • వాళ్లను వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ 

భద్రాచలం, వెలుగు:  చత్తీస్​గఢ్​ రాష్ట్రం ఇంద్రావతి నది నేషనల్​ పార్కు ఏరియాలో శనివారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరు ఎవరనేది గుర్తించాల్సి ఉందని బీజాపూర్​ ఎస్పీ జితేంద్రకుమార్ తెలిపారు.  నేషనల్​ పార్కు ఏరియాలో గత మూడు రోజులుగా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ నెల 5న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్​ మృతి చెందగా 6వ తేదీన మైలారపు అడెల్లు అలియాస్​ భాస్కర్​చనిపోయారు. తాజాగా శనివారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఆటోమెటిక్​ గన్స్, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం, నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నారు. నేషనల్​ పార్కు ఏరియాలో80 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎలాంటి పోలీస్​స్టేషన్, బేస్​క్యాంపులు లేకపోవడంతో ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు సేఫ్​ జోన్​గా ఎంచుకుని తలదాచుకున్నట్టు తెలుస్తున్నది. ఇది పసిగట్టిన డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్​పీఎఫ్ కోబ్రా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్​ చేపట్టాయి.  

అడవిలో జవాన్ల కష్టాలు 

ఈ నెల 4న డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్​పీఎఫ్  కోబ్రా బలగాలు ఇంద్రావతి నది నేషనల్​ పార్కు ఏరియా అడవుల్లోకి ప్రవేశించాయి. మూడు రోజులుగా అడవిలోనే సెర్చింగ్ కొనసాగుతుండడంతో  విపరీతమైన ఎండలకు జవాన్లు డీహైడ్రేషన్​కు గురవుతున్నారు. ఒక జవాన్​ను పాము కరిచినట్టు తెలిసింది. మరి కొందరు జవాన్లపై తేనె టీగలు దాడి చేశాయి. దీనితో వారు తీవ్ర గాయాలపాలయ్యారు. సుమారు ఏడుగురు జవాన్లు అస్వస్థతకు గురికావడంతో వారిని హెలికాప్టర్​తో తరలించి ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు.