
పాకిస్తాన్ కు చెందిన చేపల బోట్స్ ను గుజరాత్ సముద్ర తీరంలో కనుగొన్నారు భారత సెక్యురిటీ ఫోర్స్. శనివారం పాకిస్తాన్ కు చెందిన ఐదు బోట్లను కనుగున్నట్లు చెప్పారు. గుజరాత్ తీరం … హరామీ నుల్హా ఏరియాలో ఐదు బోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాళ్లు ఎక్కడికి వెళ్లారు అనే విషయంపై బలగాలు ఆరా తీస్తున్నాయి.
భారత్ లో ఉగ్రదాడులు చేసేందుకు, ఉగ్రవాదులను దేశంలోకి పంపేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని ఇప్పటికే ఇంటలీజెన్స్ సమాచారం ఇచ్చింది. కశ్మీర్ నుంచి ఉగ్రవాదులను పంపించేందుకు పాక్ కు కష్టమవుతుందని.. సముద్ర తీరం నుంచి టెర్రరిస్టులు దేశంలో చొరబడేందుకు అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది భారత ఇంటలీజెన్స్. ఇప్పటికే దేశంలోని మొత్తం సముద్ర తీరం వెంబడి బద్రతా బలగాలు అలెర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ సముద్ర తీరంలో పాకిస్తాన్ కు చెందిన చేపల బోట్లు దొరకడంతో గాలింపులు ముమ్మరం చేశారు.
Border Security Force, Gujarat: BSF seized 5 Pakistan
fishing boats during a special operation in Harami Nullah area y'day at about 2245 hours. A thorough search operation of the area has been launched&the search operation is still underway. Till now nothing suspicious recovered. pic.twitter.com/vfCS2k1Kso— ANI (@ANI) October 12, 2019