స్విమ్మింగ్ పూల్ లో పడి పిల్లాడి దుర్మరణం

స్విమ్మింగ్ పూల్ లో పడి పిల్లాడి దుర్మరణం

హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానిక మంజీర డైమండ్ టవర్స్ లో ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటం, సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయకపోవటంతో.. చిన్నారి స్విమ్మింగ్ పూల్ లోనే చనిపోయాడు. గేటెడ్ కమ్యూనిటీ వారి నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు చనిపోయాడని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. స్విమ్మింగ్ ఫూల్ మెయింటెనెన్స్ సరిగా లేదని ఆరోపిస్తున్నారు. కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోవటంలేదని.. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.