వైసీపీ వర్సెస్ జనసేన.. బెజవాడలో ఫ్లెక్సీల యుద్ధం

వైసీపీ వర్సెస్ జనసేన.. బెజవాడలో ఫ్లెక్సీల యుద్ధం

టీడీపీ వర్సెస్ జనసేన.. బెజవాడ సెంటర్‌గా ఫ్లెక్సీల రాజకీయం సెగలు రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.  దీంతో అటు అధికార పక్షం వైసీపీ.. ఇటు ప్రతిపక్షం టీడీపీ, జనసేన ఇతర పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రజా పాలనలో తమ మార్క్‌ ఏంటో వివరిస్తున్నాయి పార్టీలు. ఈ తరుణంలో ఏపీ రాజకీయాల్లో పోస్టర్ వార్ షురూ అయింది.

 వైసీపీ అధినేత జగన్ భీమిలీలో నిర్వహించిన సభకు సిద్ధం అని పేరు పెట్టారు. ఇది బాగా పాపులర్ అయింది. జనంలోకి వెళ్లింది. తాము యుద్ధానికి సిద్ధమంటూ జగన్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. భీమిలీ సాక్షిగా ఆయన చేసిన ఛాలెంజ్ ను బెజవాడలో జనసేన నేతలు తీసుకున్నట్లే కనపడుతుంది.  మీరు సిద్ధమంటే.. మేము కూడా సిద్ధం అని పెద్దయెత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ఫొటోతో ఉన్న ఈ ఫ్లెక్సీలు మేము కూడా సిద్ధమని ప్రకటించడంతో సవాల్ కు ప్రతి సవాల్ విసిరినట్లేనంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతో రెండు పార్టీల మధ్య బెజవాడలో ఫ్లెక్సీల వివాదం మరొకసారి మొదలయినట్లే కనపడుతుంది.