ఇథియోపియాలో కూలిన విమానం

ఇథియోపియాలో కూలిన విమానం

ఇథియోపియాలో విమానం కూలిపోయింది. అడిస్ అబాబా నుంచి నైరోబిక్ వెళ్తుండగా బోయింగ్ 737 విమానం ప్రమాదవశాత్తు కూలింది. విమానంలో మొత్తం 157 మంది వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో 149 మంది ప్రయాణికులు, 8 మంది విమానం స్టాఫ్ ఉన్నట్లు సమాచారం. అడిస్ అబాబాకు 62 కిలో మీటర్ల దూరంలో ఉన్న బిస్టోఫ్ కు సమీపంలో కూలింది. ఉదయం 8 గంటల 44 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

ఇథియోపియా రాజధాని అడీస్‌ అబాబా నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఆ విమానం కుప్పకూలిందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై ఆ ఎయిర్‌ లైన్‌ అనౌన్స్ చేసింది. కూలిన విమాన ఆచూకీని కనుగొని, సహాయక చర్యలు అందించేందుకు.. సంబంధిత సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించారని తెలిపింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలపై అధికారులు ఎటువంటి వివరాలు తెలపలేదు.